వ్యవసాయాన్ని పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వమేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ వ్యవసాయ క్లస్టర్, సంగుపేట గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ రైతులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో 9 రోజుల్లో 9000 కోట్ల రూపాయల రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయాన్ని జమచేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3,12879మంది రైతుల ఖాతాలలో రూ.383.48 కోట్ల రూపాయలు ఎకరాకు 6000 చొప్పున పెట్టుబడి డబ్బులు రైతు భరోసా పథకం కింద జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతు సుభిక్షంగా ఉండేలా కృషి చేస్తున్నది అన్నారు రైతు రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగలా మార్చే విధంగా ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు భరోసా పథకంతో పాటు సన్నధాన్యానికి క్వింటాలు కి రూ 500 బోనస్, రూ .2 లక్షల రుణమాఫీ లాంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిల్లాలో రైతు భరోసా 95 శాతం మంది రైతులకు అందజేసినట్లు త్వరలో మిగిలిన ఐదు శాతం మంది రైతులకు కూడా రైతు భరోసా అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతులు రైతు భరోసా డబ్బులను వినియోగించుకొని ధాన్యమైన ఎరువులు విత్తనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ డీలర్ల వద్ద కొనుగోలు చేసి బంగారు పంటలు పండించాలని ఈ సందర్భంగా జిల్లాలోని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆర్డీవో పాండు, సంబంధిత శాఖల అధికారులు రైతులు ,రైతు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment