సంగారెడ్డి, జూన్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): 2025-26 లయనిస్టిక్ సంవత్సరంకు మంగళవారం రాత్రి పోతిరెడ్డిపల్లిలోని జేఆర్ఆర్ గార్డెన్ లో లయన్స్ క్లబ్ ఆప్ సంగారెడ్డి ఆదర్శ కార్యవర్గ ప్రమాణ శ్రీకారం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ గవర్నర్ లయన్ ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ 320డి పరిధిలో సంగారెడ్డి క్లబ్ కు మంచి పేరున్నదని, భవిష్యత్తులో కూడా విద్య, వైద్య, వ్యవసాయ, పర్యావరణ రంగాలలో విశిష్ట సేవలు చేయాలని సూచించారు. సంగారెడ్డి లయన్స్ క్లబ్ ఆదర్శ అధ్యక్షుడిగా పి.రామకృష్ణరెడ్డి, కార్యదర్శిగా ఆర్.కిరణ్ గౌడ్, కోశాధికారిగా యం.వెంకటేశం, ఇతర సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. కార్యక్రమంలో పీడీజీ.ఇన్సట్టాలేషన్ అధికారిగా లయన్ సూర్యరాజ్, పీడీజీ జిల్లా అడ్వైసర్ ఇండక్షన్ అధికారిగా లయన్ రమణ, రీజియన్ చైర్మన్ యన్.కరుణాకర్ గౌడ్, డిస్టిక్ చైర్మన్ పి.రాములు గౌడ్, ప్రోగ్రామ్ కో చైర్మన్ లయన్ డి.హనుమంత్ గౌడ్, ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ ఎస్.విజయేందర్ రెడ్డి, లయన్ జార్జ్ మాథ్యూ, లయన్ నాయికోటి రామప్ప, లయన్ శేషత్వం క్రిష్ణ, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
సంగారెడ్డి ఆదర్శ సేవలు ఆదర్శం: లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ లయన్ ఓబుల్ రెడ్డి
Published On: June 25, 2025 8:37 pm
