ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ రైతులకు రైతు భరోసా అందించాం: కాటా శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి/పటాన్‌చెరు, జూన్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇచ్చిన మాట ప్రకారం పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా అందించామని నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు విజయవంతంగా జమ కావడాన్ని పురస్కరించుకుని, జిన్నారం గ్రామంలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమమని, ఇచ్చిన మాట ప్రకారం పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన రైతుకు రైతు భరోసా నిధులు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహలకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రవీందర్ గౌడ్, చంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగేందర్ గౌడ్, కార్యకర్తలు, కేఎస్ జీ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment