తెలంగాణ పోరాటానికి ఆచార్య జయశంకర్ జీవితం అంకితం

*తెలంగాణ పోరాటానికి ఆచార్య జయశంకర్ జీవితం అంకితం*

*తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 21 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ పోరాటానికి ఆచార్య జయశంకర్ జీవితాన్ని అంకితం చేశాడని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇల్లందకుంట మండల కేంద్రంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి పూలతో ఘనంగా నివాళులు అర్పించారు

అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఉద్యమకారుల ఐక్యతా దివస్ గా జరుపుకోవాలని పిలుపునిచ్చారని ఆచార్య జయశంకర్ తన జీవీతాన్నే త్యాగం చేసిన మహనీయుడనీ జయశంకర్ జీవితం పుట్టుక తనది, చావు తనది, బ్రతుకంతా తెలంగాణది, అంతటి త్యాగంతో తెలంగాణ సాధన పోరాటానికి గొప్ప సిద్ధాంత కర్తగా గొప్ప స్ఫూర్తిని అందించిన గొప్ప త్యాగ ధనుడు జయశంకర్ ఆని వారి ఆదర్శంతో ఉద్యమకారులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకుంటామని

గత ప్రభుత్వాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల అంశాన్ని ఆరు గ్యారంటీల్లో చేర్చి గౌరవించిందని ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి సముచిత గౌరవం ఇవ్వాలని, ఎటువంటి తాత్సారం చేయకుండా పెన్షన్ ఇంటి స్థలాలు వెంటనే అమలు చేయాలని కోరారు ఉద్యమాకారులంతా ఐక్యంగా ఉండి, సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తూనే ఉద్యమకారుల హక్కుల సాధనకు, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని, ఆచార్య జయశంకర్ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఆకాంక్షలను సాధించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కనవేనా శ్రీనివాస్ యాదవ్, ఆరే రమేష్ రెడ్డి, రావుల రాజబాబు, పెద్ది కుమార్, మాదారపు రత్నాకర్,వంగ రామకృష్ణ, గంగారపు మహేష్, కారింగుల రాజేందర్, బిజిగిరి శ్రీకాంత్, గైకొటీ రాజు, అకినపల్లి వెంకటేష్, ఉప్పు దుర్గయ్య, బైరెడ్డి రవీందర్ రెడ్డి, రామ్ రవి, రాజేరు, మల్లేష్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment