రామాయంపేటలో గ్రంథాలయాన్ని అభివృధ్ధి చేయాలి: బీజేపీ జిల్లా నాయకుడు శంకర్ గౌడ్

IMG 20250417 192104
మెదక్, ఏప్రిల్ 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా రామయంపేటలో సుమారు 39 ఏండ్ల కింద గ్రంధాలయాన్ని ఏర్పాటు చేశారని, సరైన సౌకర్యాలు లేక ఉద్యోగులు, యువకులు, పాఠకులు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ జిల్లా నాయకుడు జె.శంకర్ గౌడ్ అన్నారు. గురువారం రామయంపేటలో ఆయన గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ..రామయంపేటలో సుమారు 39 ఏండ్ల కింద గ్రంధాలయాన్ని ఏర్పాటు చేశారని, ప్రస్తుత ఈ ప్రాంత జనాభా సుమారు ఒక లక్ష మందికి పైగా ఉంటుందని అన్నారు. 60 గ్రామాల ప్రజలు ఇక్కడకి విద్య, వైద్యం, ప్రభుత్వ కార్యాలయాల పనుల కోసం ఇక్కడకు వస్తుంటారని తెలిపారు. గ్రంథాలయాన్ని అభివృధ్ధి చేసినట్టయితే రామాయంపేట మండల ప్రధాన కేంద్రంగా ఉండే లైబ్రరీకి చుట్టు పక్కన ఉన్న మండలాల నుండి నిరుద్యోగ యువతి, యువకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్కూల్, కళాశాలల విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే పోటీ పరీక్షలకు ప్రయత్నించే నిరుద్యోగ యువతి, యువకులకు ఇక్కడ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం లైబ్రరీలో ఎలాంటి వసతులు లేవని, చదువుకోడానికి కామారెడ్డి, మెదక్ వెళ్తున్నారని అన్నారు. గతంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ సుహాసిని రెడ్డి పర్యటించినా పరిస్థితి అట్లాగే ఉందని తెలిపారు. అధునాతన లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద, మధ్య తరగతి యువతీ, యువకుల కుటుంబాలకు మేలు జరుగుతుందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి, గ్రంథాలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు.

Join WhatsApp

Join Now