మెదక్/నర్సాపూర్, జూన్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ మండలంలోని కొండాపూర్, కాగజ్ మద్దూర్, నత్నాయపల్లి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కొండాపూర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అనేక సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళన దిగినట్లు తెలిపారు. స్థానిక రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ ఈ రోడ్డుపై ప్రయాణించాల్సి వస్తోందని, గుంతల కారణంగా అనేక రోడ్డుప్ర మాదాలు సంభవిస్తున్నాయని వారు తెలిపారు. రోడ్డు మరమ్మతులు చేపట్టే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు నీలి నాగేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, టౌన్ జీఎస్ రామ్ రెడ్డి, సంగసాని రాజు, జిల్లా మహేష్, ఎన్.హరి, పి. మహేష్, ఎస్.దర్శన్, కుమ్మరి శెటయ్య, ప్రవీణ్, నవీన్, కృష్ణ, మల్లేష్, ఆంజనేయులు, రాజేష్, ఎల్లం, ఎస్. రాజు, మీసాల నరేందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నత్నాయపల్లి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని బీజేపీ రాస్తారోకో
Published On: June 20, 2025 3:02 pm
