ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి ఎదురు దెబ్బ
– ఎమ్మెల్యే పి ఎ ల బాధలు భరించలేక చైర్మన్ రాజీనామా
– ఎల్లారెడ్డి నియోజకవర్గం సి డి సి చైర్మన్ మొహమ్మద్ ఇర్షాదుద్దీన్ రాజీనామా
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి రాను రాను గడ్డు కాలమే ఉంటుందని అక్కడ కార్యకర్తల మనోభావాలు రుజువు చేస్తున్నాయి. గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గ సి డి సి చైర్మన్ మొహమ్మద్ ఇర్షాదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మహ్మద్ ఇర్షాద్ మిలేకర్లతో మాట్లాడుతూ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ కైలాస్ శ్రీనివాస్ కి నమస్కారములు,
విషయం:- కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అంశం.
నమస్కారం అన్న.
గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా,ప్రజాప్రతినిధిగా మదన్ మోహన్ రావు నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీపడకుండా కష్టాలు,కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీప్రతిష్టకోసం,కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను.కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తివిధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ, విస్మరిస్తూ, పార్టీద్రోహులు, కీలకబాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇక్కడ మొత్తం ఎమ్మెల్యే పి ఎ లు మన సొంత పార్టీ నాయకులు అయినా షబ్బీర్ అలీ గాని ఏ ఇతర నాయకులు కలిసిన తమ దగ్గరికి రావద్దు అని అంటున్నారు. తమ వాట్సాప్ గ్రూప్ లో నుండి ఎవ్వర్నీ లెక్కచేయకుండా తొలగించడం జరుగుతుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం లో కష్టపడ్డ ఏ నాయకునికి ఎలాంటి గౌరవం లేదు, ఏ ప్రోగ్రాం జరిగిన మండల అధ్యక్షులు గాని వివిధ హోదాలో ఉన్న నాయకుల గాని ఎలాంటి సమాచారం ఉండదు, ఇక్కడ వివిధ మండలాల్లో ఉన్న అధికారులకు పిఏలు ఫోన్లు చేసి ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చిన పని చేయద్దు మేము చెప్పే వరకు అని అధికారులకు చెప్పడం జరిగింది, ప్రతి విషయంలో పి ఎ లది పెత్తనము, వారి హుకుం ప్రకారమే నాయకులు నడుచుకోవాలి, ప్రతి దందాలు పి ఏ లు ముందుకుంటున్నారు, మా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చాలా మంచోడు అతనికి పి ఎ లు చేసే వ్యవహారాలు తెలియదు. గత కొన్ని రోజుల నుండి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పట్టించుకోవడం లేదు, అప్పుడు బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నా పై రౌడీ షిటర్ ఓపెన్ చేశాడు. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నందుకు, అంతేకాకుండా నన్ను చాలా ఆర్థికంగా నష్టపరిచాడు, నా సొంత వ్యవసాయ భూమి వద్ద ఇబ్బందులు పెట్టాడు అయినా కానీ మేము అన్ని భరించుకుంటూ బాధలు పడుకుంటూ మదన్మోహన్ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మదన్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీకి కష్టపడ్డా నాయకులకు ఎలాంటి గౌరవం లేదు పి ఎ లది రాజ్యం పి ఎ లు చెప్పిందే శాసనం పి ఏ లను ఎవరైతే జోగుతారు వారిని దగ్గర తీస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు , ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అందుకోసమే నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయ దలుచుకున్నాను దయచేసి నా రాజీనామాను ఆమోదించగలరని తమరికి విన్నవించుకుంటున్నాను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం,ఆత్మగౌరవం అన్నవిషయం మీకు తెలియనదికాదు. నావల్ల ఎమ్మెల్యే మదన్మోహన్ కు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి నేను ఆత్మగౌరం లేని చోట ఉండలేను కావున పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.దయచేసిఆమోదించగలరు.
ధన్యవాదాలతో.. అంటూ సీడీసీ చైర్మన్ తన రాజీరా మలేఖన ముగించారు. ఇకనైనా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన పిఏ లను అదుపులో పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.