రైతుల శ్రేయస్సు కోసం ఆధునిక సాగు పద్ధతులు అవసరం: ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతులు శాస్త్రీయ పద్ధతులు మరియు ఆధునాతన వ్యవసాయ సాంకేతికతను అనుసరించాల్సిన అవసరం ఉందని ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలంలోని లక్డారం గ్రామ రైతు వేదికలో సోమవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాత పద్ధతులకు బదులుగా శాస్త్రపరమైన, నూతన పద్ధతులను ఉపయోగించుకోవడం ద్వారా రైతులు దిగుబడులు పెంచుకోవచ్చని, అలాగే ఖర్చులు తగ్గించుకుని లాభదాయక వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా సలహాలను, శిక్షణలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అధికారలు, శాస్త్రవేత్తలు మట్టిపరీక్షలు, పంటల రక్షణ, నీటి వినియోగం, ఎరువుల సమతులిత వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మనోహర, ఏఓ శివకుమార్, ఏఈఓ మహేష్, శాస్త్రవేత్తలు అపర్ణ, ఆత్మ కమిటీ డైరెక్టర్లు మధుసూదన్, ఫయాజ్, సిగల్ విండో వైస్ చైర్మన్, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment