పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అక్కడున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్​ వెంకటస్వామిలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి​ డీజీపీ, సీఎస్​తో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్​ రామకృష్ణారావు అధ్వర్యంలో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ స్పెషల్​ సీఎస్​, లేబర్​ డిపార్టుమెంట్ పీఎస్​, హెల్త్ సెక్రెటరీ, ఫైర్​సర్వీసెస్​ అడిషనల్​ డీజీరని ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాశమైలారంలో ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి వెళ్ళనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment