సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): అనంతారం పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం గుమ్మడిదల మండలం అనంతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్ కుమార్, సుజాత, విద్యా కమిటీ చైర్మన్ స్వప్న మహేష్ యాదవ్ నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆధునిక విద్యలో నైపుణ్యం సాధించాలన్నదే లక్ష్యంగా వారికి అవసరమైన కంప్యూటర్లు, షూస్, టైలు, బెల్ట్లు, ఐడి కార్డులు సమకూర్చేందుకు తాను ముందుండి సహాయ పడతానని హామీ ఇచ్చారు. విద్యార్థులు కూడా క్రమ శిక్షణతో విద్యలో ముందుకు సాగాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి నాణ్యత ఉన్న విద్యను అందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యాదిరెడ్డి, దయాకర్ రెడ్డి, లక్ష్మణ్, రమణ, వీరారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నరసింహారెడ్డి, నర్సింలు, సాయిగౌడ్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతారం పాఠశాల అభివృద్ధికి సహాయం చేస్తా: సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
Published On: June 18, 2025 7:08 pm
