భవాని మాత మందిరంలో పూజలు చేసిన కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణం హట్కరిపేటలో నవరాత్రుల అనంతరం శ్రీ భవాని మాత మందిరంలో అమ్మవారి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పాల్గొని అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చనను చేశారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన పాటలను, ఆరతి పాటలను ఆలాపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆలయ కమిటీ వారు భక్తులందరికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు, ఆలయ కమిటీ సభ్యులు హరి, ప్రకాష్, రవి, నర్సింగ్, శ్రీను, సంతోష్, అర్జున్, అంజన్న, త్రియంబక్, మనోహర్, రైతు సమాఖ్య అధ్యక్షులు తుమ్మలపల్లి పృథ్వీరాజ్, గంట శివన్న, కనిగిరి శంకర్ పీ.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, హరీష్ కుమార్, అఖిల్, మనోజ్, ఆనంద్, నరేష్, సోమ శంకర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now