ముఖ గుర్తింపుతో పెన్షన్ ఇవ్వడం వల్ల అక్రమాలకు చెక్: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముఖ గుర్తింపు యాప్ ద్వారా పెన్షన్లు ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి వార్డు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వృద్ధులు వికలాంగులు, ఒంటరి మహిళ లకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు ప్రత్యేక ఆప్ ద్వారా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ముఖ గుర్తింపు యాప్ తో పెన్షన్లు ఇవ్వడం వల్ల వృద్దులు వేలిముద్రలు రాని వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వాలని ఉద్దేశంతో చేయూత పథకం వలన ప్రతి నెలా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు బిల్ కలెక్టర్లు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ద్వారా నూతనంగా ప్రభుత్వం రూపొందించిన ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో పెన్షన్ దారులు మృతి చెందితే సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి విషయం తెలియజేయకుండా డబ్బులు స్వాహా చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. అలాంటి సంఘటనలు ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఇక మీదట సాగవు అన్నారు. ఆధార్ కార్డు డేటా అనుసంధానం తో ఈ విధానం ఈ నెల నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొత్త విధానంలోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పింఛన్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంపిణీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు అప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ద్వారా పింఛన్ లబ్ధిదారులకు నిత్య అవసరాలకు నిధులు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్ డిఓ సూర్యరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment