కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అంబేద్కర్ సేవా సమితి నాయకులు

కలెక్టర్
Headlines
  1. ఫసల్ వాడి దళిత భూముల రక్షణకు పోరాటం
  2. కలెక్టర్ వద్దకు బాధితులు: దళిత భూముల కోసం వినతి
  3. తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి నాయకత్వంలో వినతి పత్రం అందజేత
  4. దళితుల భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కొండాపురం జగన్
  5. ఫసల్ వాడి 599 సర్వే నంబర్ భూముల వివాదం: బాధితుల పక్షాన నిలిచిన అంబేద్కర్ సేవా
సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామంలో 599 సర్వే నంబర్లలో దళితులకు సంబంధించిన భూములను ప్రభుత్వం తీసుకోవాలని ప్రయత్నించడాన్ని విరమించుకోవాలని కోరుతూ బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపురం జగన్ కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బైండ్ల అశోక్ తదితరులు అన్నారు.

Join WhatsApp

Join Now