Site icon PRASHNA AYUDHAM

గుర్తుతెలియని వ్యక్తి మృతి 

IMG 20251108 WA0000

గుర్తుతెలియని వ్యక్తి మృతి 

గుర్తుపట్టిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వండి

నిజాంసాగర్ చౌరస్తా దగ్గర ఘటన

 గాయత్రి పచ్చబొట్టు ఆనవాలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) నవంబర్ 8

కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలో గల కాలభైరవ కిరాణా సూపర్ మార్కెట్ ముందు ఈ రోజు ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్యగా అంచనా.

పోలీసుల వివరాల ప్రకారం, ఆ వ్యక్తి కుడిచేతిపై “Gayatri” అని ఇంగ్లిష్‌లో పచ్చబొట్టు గలదు. ఆయన నలుపు, తెలుపు, నీలం రంగుల డబ్బాలు ఉన్న రెడీమేడ్ చొక్కా, నీలం రంగు రెడీమేడ్ ప్యాంటు ధరించి ఉన్నాడు.

ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు వెంటనే సమాచారం ఇవ్వవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

📞 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

SHO : 8712686145

PS : 8712666242

Exit mobile version