సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసు శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విని, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత యస్.హెచ్.ఓ.లకు ఫోన్ ద్వారా మాట్లాడి, వారి సమస్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని అమలు పరచడం ఎలాంటి అలసత్వం చూపరాదని, చట్ట ప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ.లకు సూచనలు చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యకు పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసుశాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: August 11, 2025 6:47 pm