సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): జహీరాబాద్ పట్టణ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. అనంతరం అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేస్తూ.., లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసులు, ఎన్.బి.డబ్ల్యూ చేదనకు సబ్-డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీఎస్పీకి సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అన్నీ వర్టికల్ విభాగాలలో ప్రావీణ్యం కలిగి ఉండాలని అన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని ఎస్.హెచ్.ఓలకు సూచించారు. గణేష్ నిమర్జనాలను పురస్కరించుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలని, వినాయక శోభాయాత్ర సందర్భంగా వివిధ మతాలకు చెందిన పవిత్ర స్థలాలు గుడులపై రంగులు పడకుండా ఎత్తైన బారికెట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం వినాయక నిమర్జనాలు జరగనున్న నారింజ బ్రిడ్జ్ ను సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. నిమర్జన సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా క్రేన్ లను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని డిఎస్పీకి సూచించారు.. అనంతరం జహీరాబాద్ పట్టణంలోని, మాణిక్ ప్రభు మందిరంలో ఏర్పాటు చేసిన వినాయక పూజకు ఎస్పీ హాజరై, గణనాధునికి పూజలు చేసి, జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అల్లర్లు సృష్టించే సంఘ విద్రోహ శక్తుల నుండి కాపాడాలని, జిల్లా ప్రజలను సుఖ:సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా ఆశీర్వాదహించాలని గణనాధునికి పూజలు నిర్వహించారు. వీరి వెంట జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, రూరల్ ఎస్ఐ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.
జహీరాబాద్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..
Published On: September 3, 2025 9:28 pm