సంగారెడ్డి, జూన్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్.పోట్రు.రామకృష్ణ అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో బుధవారం ఏఎస్ రావు నగర్ రెసిడెన్సి కమ్యూనిటీ హాల్, ఈసీ ఐఎల్ హైదరాబాద్ లో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ ఈ పురస్కారంను దీపాలి, శిరీష మోను వంటి ప్రముఖల చేతుల మీదుగా అందుకున్నారు. రామకృష్ణ విద్యారంగంలో చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఉపాధ్యాయ పాత్ర ఎంతో విలువైనదని అన్నారు. తనకు అంతర్జాతీయ విద్యా పురస్కారం అందచేసినందుకు వరల్డ్ చారిటి వెల్ఫేర్ ఫౌండేషన్ ఢిల్లీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రామకృష్ణ ఇప్పటి వరకు రెండు గౌరవ డాక్టరేట్లతో పాటు ప్రభుత్వ విభాగంలో 2014 మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2015 ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2018 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు గాను జిల్లా స్థాయి పురస్కారం, 2019 తెలంగాణ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2025 తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ పురస్కారం మరియు 2025 లో ఎస్సీఆర్టీ బెస్ట్ ప్రాక్టీసెస్ లో జిల్లా స్థాయి ప్రధమ స్థానం పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. వీటితో పాటుగా గ్రీన్ ఇండియా, ఆటా,ఐటాప్,రోటరీ క్లబ్,లైన్స్ క్లబ్,శారద సొసైటీ, తెలుగు కళా రత్నాలు, వల్లూరి ఫౌండేషన్ వంటి పలు స్వచంద సంస్థల ద్వారా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలలో బంగారు నంది, కామదేనువు, గురు బ్రహ్మ, ఉపాధ్యాయ రత్న, ప్రతిభారత్న, జై భారత్ వంటి పురస్కారాలు దాదాపు 32 వరకు అందుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణను మండల విద్యాధికారి శంకర్, మండల నోడల్ అధికారి సుధాకర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
అంతర్జాతీయ విద్యా పురస్కారం అందుకున్న డా.రామకృష్ణ
Published On: June 25, 2025 9:15 pm
