సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీయూడబ్ల్యూజే-ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైజల్ అహ్మద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి ఐబీలో ఆదివారం సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు సన్మానించారు. ఐబీలో జరిగిన కార్యక్రమంలో ఫైజల్ అహ్మద్ ద్వారా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ నాయకత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫైజల్ అహ్మద్ ఆధ్వర్యంలో తమ యూనియన్ అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పాటు పడే వ్యక్తి పైసల్ అని కొనియాడారు. ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటూ అందరి సంక్షేమాన్ని కాపాడే నాయకుడు అని పేర్కొన్నారు. అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌస్ హాష్మీ వేడుకల్లో పాల్గొని శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ సిద్ధిఖ్, రాష్ట్ర హౌసింగ్ కమిటీ సభ్యుడు అన్వర్, ఫోటో గ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్, మసూద్ ఇంతియాజ్, డేవిడ్, అన్వర్, విల్సన్,రాజు, మతీన్,రాజు, మురళి, హాజీ, మిన్ హాజ్, దయానంద్, శ్రీనివాస్, షౌకత్ అలీ, అబ్బు, సంతోష్, కృష్ణ , సతీష్, సాయి, శ్రీకాంత్, మల్లేశం, నాగేందర్, ఆమీర్, యూసఫ్, లడ్డు, తదితరులు పాల్గొన్నారు.