రైతులు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించాలి: ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతులు తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించాలని పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలంలోని అనంతారం గ్రామంలో మంగళవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో పాటు శాస్త్రీయంగా ఆధారితమైన సాగు విధానాలను అవలంభించాలని సూచించారు. నూతన సాంకేతికత, భూసార పరీక్షలు, తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు పొందే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు హేమలత, జానకి శ్రీనాథ్, ఏఓ శ్రీనివాసరావు, ఏఈఓ ప్రణవి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు సుష్మిత, హిమ కుమార్, రైతులు పాల్గొన్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment