సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో గత మూడు రోజులుగా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో రూ.186 కోట్ల.60 లక్షల రూపాయలు, 24 మండలాలకు చెందిన రెండు లక్షల అరవై ఐదు వేల 156 మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం వల్ల జిల్లాలోని సన్న,చిన్న కారు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. జిల్లాలో పంటలు సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసానిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. వర్షాకాలం పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో ఖరీఫ్ సీజన్ కు ఎకరాకు 6000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన పెట్టుబడి సాయం డబ్బులతో రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఖరీఫ్ పంటలు సాగు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.
రూ.186 కోట్ల 60 లక్షల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: June 18, 2025 8:11 pm
