ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎస్సీ వర్గీకరణ తోనే అమలు పరచాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 6
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సుజాతనగర్ ఎమ్మార్వో, ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేసిన ఐక్యవేదిక నాయకులుఇటీవల సుజాతనగర్ మండల ఎమ్మార్వో గా నూతన బాధ్యతలు చేపట్టిన కృష్ణ ప్రసాద్ ను మాదిగ ఐక్యవేదిక సుజాతనగర్ మండల నాయకులు శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు, పూల బొకే అందించి శాలువాతో స్వాగత శుభాకాంక్షలు తెలిపారు ,మండలంలో రెవిన్యూ విషయమై రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఎమ్మార్వో దృష్టికి తీసుకువెళ్లారు, ఎంపీడీవో ఆఫీస్ ఇంచార్జ్ శ్రీనివాస్ కు పలు సమస్యల వినతి పత్రం అందజేశారు ,ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, కార్పొరేషన్ రుణాలు ఎస్సీ వర్గీకరణ తో మంజూరు చేయాలని అందులో వికలాంగులకు ప్రత్యేక కోట ఏర్పాటు చేయాలని, అలాగే సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, బస్ షెల్టర్ లేక ప్రయాణికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, సెంటర్లో బస్టాండ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు, ఈ సందర్భంగా నాయకులు స్పందిస్తూ ఇదివరకే టాయిలెట్స్ బస్టాండ్ సమస్య విషయమై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, మంజూరు అయ్యాయని కట్టిస్తామని అంటున్నారే తప్ప ఆచరణలో అది కనిపించటం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే మండల కేంద్రంలో దీక్షలు చేపడతామని ఐక్యవేదిక నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్, ఉపాధ్యక్షులు అంకి శెట్టి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామెర్ల సర్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి తడిక మల్ల దిలీప్, ప్రత్యేక ఆహ్వానితులు మంద రాజు, మురిపిటి నాగేష్ ,గుండేటి రాములు, గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న, సిరిగిరి మురళి ,కత్తి కృష్ణ ,మండల నాయకులు తోకల వెంకటేశ్వర్లు, గార్ల రవి ,మురిపిటి నాగయ్య, కొండ్రు ప్రవీణ్ ,గంగపురి వెంకటేశ్వర్లు, కాకటి రాము, దంసలపూడి పవన్ ,తగరం రమేష్ దితరులు పాల్గొన్నారు*

Join WhatsApp

Join Now

Leave a Comment