జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం 

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ఆయుష్ శాఖ మార్గదర్శకాల మేరకు కామారెడ్డి జిల్లాలో విశిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జూన్ 21, 2025 (శనివారం)ఉదయం 7:00 నుంచి 8:00 గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.

ఈ సందర్భంగా ప్రకృతి వైద్యాధికారి డాక్టర్ దేవయ్య పర్యవేక్షణలో కామన్ యోగా ప్రోటోకాల్, యోగ గీతం, ధ్యానం, యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్ తెలియజేశారు.

యోగా కు అంతర్జాతీయ గుర్తింపు లభించి 11 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమనికి అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి, మెడికల్ ఆఫీసర్లు, ఎన్జీవో ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు, ఇతర శాఖల అధికారులతో పాటు ఉద్యోగులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులు, విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా మారి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment