ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 28 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు.
తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించే వారే ధన్యజీవులని,వారే దేవుని హృదయానుసారులుగా ఉంటారని,అదేవిధంగా స్వర్గీయ కేదాసి పుష్పమ్మ సింగరేణి సంస్థలో ఉద్యోగినిగా పనిచేస్తూ, తను వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని పూర్తిగా తన కుటుంబం కొరకు మరియు యేసు క్రీస్తు ప్రభువు కొరకు ధారపోసి, ప్రేమగలదానిగా నీతిమంతురాలుగా,
పరోపకారం దాన గుణం, త్యాగశీలత మరియు క్రైస్తవ ఆత్మీయత ఆదరణ కలిగిన గొప్ప జీవితాన్ని మనందరికీ ఈ సమాజానికి పంచినదని, ఆమె పరోపకారం త్యాగశీలత దానగుణం ప్రేమ తత్వం , మనందరం స్ఫూర్తిగా తీసుకొనికొనియాడారు.
తొలుత ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు బృందం స్వర్గీయ పుష్పమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులందరికీ తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సి ఎస్ ఐ పాస్టర్లు ఏసోబు,సుందరావు, మరియు పాస్టర్లు సాల్మన్, సునీల్ కేదాస్ పీటర్ బాబు, రాయి శైలస్ మరియు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు , సామ్యూల్ విజయ రాజు , వెంకటేశ్వర్లు ,రవి, మద్దెల ఆదర్శ్ డేవిడ్, కేదాసీఎఫ్ రాయిం, నిఖిల్ నికోలస్, పాల్ సుహాస్, రేవంత్, కేదాసీ సువార్త, లత, హెప్సీబా అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కేదాసి పుష్పమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
by Naddi Sai
Published On: June 28, 2025 9:19 pm
