సంగారెడ్డి, మే 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): యువజన కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా విస్తృతస్థాయి ఎగ్జిక్యూటివ్ సమావేశం సంగారెడ్డి నియోజకవర్గ పెద్దాపూర్ పట్నం హైవే బంకేట్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ లు శ్యామ్ చరణ్ రెడ్డి, నాగార్జున హాజరయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు మున్నూరు రోహిత్ విభాగంతో సంగారెడ్డి మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల సెక్రటరీలతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నరేష్ గౌడ్, రోహిత్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ విభాగం బలపరిచే విధంగా ముందుకు వెళ్తామని, పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్ ఎప్పుడు ముందడుగు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు వెంకట్, ఉపాధ్యక్షుడు సల్మాన్ మాలిక్, మండల అధ్యక్షుడు సాజిత్, ప్రవీణ్, అశోక్ మండల్ ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, సెక్రటరీ కుమార్ యాదవ్, ముక్రం తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిని సన్మానించిన నాయకులు
Published On: May 19, 2025 9:17 pm
