*మిర్యాలగూడలో భారీ మోసం: రూ.4 కోట్లతో నిర్వాహకులు పరార్!*
మిర్యాలగూడలో వెలుగు చూసిన భారీ లాటరీ మోసం
ఆర్కే ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.4 కోట్ల వసూళ్లు
సుమారు 2600 మందిని బురిడీ కొట్టించిన నిర్వాహకులు
బహుమతుల ఆశ చూపి, స్కీమ్ ముగిశాక పరారీ
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు, కేసు నమోదు
రమేశ్, కోటేశ్వరరావు, శ్రీనివాస్పై ప్రధాన ఆరోపణలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో లాటరీ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని నమ్మించి, వేలాది మంది అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించిన ఘటన సోమవారం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, మిర్యాలగూడకు చెందిన రమేశ్, కోటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ‘ఆర్కే ఎంటర్ప్రైజెస్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వీరు నెలకు రూ.1000 చొప్పున 15 నెలల పాటు చెల్లించేలా ఒక స్కీమ్ను ప్రకటించారు. ప్రతి నెలా డ్రా తీసి, పది మంది అదృష్టవంతులకు విలువైన బహుమతులు అందిస్తామని ప్రచారం చేశారు.
వీరి మాటలు నమ్మిన కొందరు వ్యక్తులు ఏజెంట్లుగా చేరారా