మంజీరా డ్యాం సేఫ్: నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): మంజీరా డ్యాంను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లతో కలిసి మజీర డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జంట నగరాల త్రాగు నీరు అందించే మంజీరా నది సేఫ్ అని అన్నారు. డ్యాం ఎలాంటి పగుళ్ళు లేవన్నారు. మరమత్తుల కోసం మూడున్నర కోట్ల రూపాయలు కేటాయించమన్నారు. డ్యాం పనులకోసం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ రవీందర్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ పటాన్ చెరువు డివిజన్ Il జనరల్ మేనేజర్ మాణిక్యం, రాజం పేట్ అండ్ కులబ్గూర్ డిజిఎమ్, ఏ.రామక్రిష్ణ, నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment