సంగారెడ్డి, జూన్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో 100 డేస్ రిస్సింగ్ లో భాగంగా పచ్చదనం పరిశుభ్రత పయనీర్స్ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా యువజన శాఖ డాక్టర్ కూన వేణు, అటవీ శాఖ అధికారి దేవిలాల్ హాజయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి విద్యార్థులు మొక్కలను సుమారు 1129 విద్యార్థి విద్యార్థుల చేత పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం నిండు ఉండేలా పాఠశాల ప్రాంగణంలో తిరిగించడం జరిగింది. సంగారెడ్డి పట్టణంలో ఏ పాఠశాల చేయని కార్యక్రమం పయనీర్స్ పాఠశాల గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అందుకు విచ్చేసిన అతిథులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న విద్యార్థి విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు పాఠశాల ప్రిన్సిపాల్ ఇమ్రానా, స్కూల్ యజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.
పయనీర్స్ పాఠశాలలో మాస్ ప్లాంటేషన్ డ్రైవ్
Published On: June 29, 2025 8:31 am
