కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వైన్ షాపు సమీపంలో మంగళవారం ఒక మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కరీంనగర్ పట్టణానికి చెందిన కాసిన గొట్టు భారతి అనే మహిళ ఈ ఘటనలో గాయపడింది.
సమాచారం అందిన వెంటనే రామడుగు ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాయపడిన మహిళను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఎస్ఐ రాజు మానవత్వం చాటుతూ, స్ట్రెచర్పై ఉన్న మహిళను స్వయంగా లోపలికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.











