నిర్మల్ పట్టణంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కోసం అవగాహన కార్యక్రమం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణ పథకాలపై అధికారులు వివరించారు.
నిర్మల్ పట్టణంలోని హోటల్ మారుతి ఇన్ లో శనివారం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు, ప్రయోజనాలను లబ్ధిదారులకు వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఆర్థికాభివృద్ధికి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ రుణ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని వారు ప్రోత్సహించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా, ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. పథకాలకు సంబంధించిన మెళకువలను నేర్చుకోవాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇండియన్ పోస్ట్స్ మేనేజర్ వీరస్వామి, పోస్టల్ ఇన్స్ పెక్టర్ రాజేంద్ర యాదవ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ దినేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

