పవిత్ర రంజాన్ ఉపవాసాలు ముగిసిన సందర్భంగా, కూకట్పల్లిలోని ఎల్లమ్మబండ మస్జిద్ వద్ద రాజన్న టీమ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజన్న టీమ్ తరపున ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినట్లు బుల్లెట్ రవి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో, 30 రోజుల దీక్షతో ఉపవాసాలు విజయవంతంగా ముగించుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్ట్ తెల్ల హరికృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడ్ల శ్రీనివాస్, సయ్యద్ ఇంతియాజ్, కాజా, గిరి, తిరుపతి కూడా పాల్గొన్నారు.
రాజన్న టీమ్ యూత్ సభ్యులు శంకర్, నాని, శివ, హర్ష, చింటు, అరుణ్ తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.











