Headlines :
-
ప్రజా పాలన విజయోత్సవం – పటాన్ చెరులో ఘనంగా నిర్వహణ
-
కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభకు భారీ స్పందన
-
మెట్టు సాయి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్ చెరు సమావేశం
-
తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవం – కాంగ్రెస్ నేతల ప్రతిజ్ఞలు
-
బచ్చుగూడ గ్రామం ప్రజా పాలన విజయోత్సవానికి సాక్ష్యంగా మారింది
సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజా పాలన ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాలలో భాగంగా శనివారం పటాన్ చెరు నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సమావేశాన్ని పటాన్ చెరు మండలం బచ్చుగూడ గ్రామంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇంఛార్జి నీలం మధు, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీశైలం, శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ఎస్సి సెల్ కన్వీనర్ నరసింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ఛైర్మన్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, నర్సింగ్ రావు, అశోక్ ముదిరాజ్, మునిసిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, గోపాల్, యాదగిరి, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరేష్, కౌన్సిలర్ చంద్రారెడ్డి, భుజంగారెడ్డి, మహిళ కాంగ్రెస్ శోభక్రిష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్ జయమ్మ, రాజి రెడ్డి, శివానందం, సుధాకర్, విక్రమ్ గౌడ్, వీరారెడ్డి, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.