కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ నాయకులు, క్రెడా సంఘం ప్రతినిధులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
కామారెడ్డి పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు, క్రెడా అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్, క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని టిపిసిసి నాయకులు పేర్కొన్నారు.









