సంగారెడ్డి/పటాన్ చెరు, మే 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ప్రత్యేక పూజలు చేశారు. గురువారం పటాన్చెరులోని హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాదిరి ప్రిథ్వీరాజ్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయంలో మాదిరి ప్రిథ్వీరాజ్ పూజలు
Published On: May 22, 2025 6:52 pm
