మెదక్/నర్సాపూర్, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకుడు, దేశ సౌభ్రాదృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజిరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజిరెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ పరిపాలనలో సంస్కరణలు తెచ్చి, తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఆయన స్పూర్తిగా నేడు తెలంగాణ రాష్ట్రములో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో అభివృద్ధి జరుగుతుందని, ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ, నిరుద్యోగ యువతకు యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, రైతు రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్త, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షుడు రిజ్వాన్, మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, లలిత నర్సింగ్, శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేష్, లలిత నర్సింగ్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రషీద్, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు అశోక్ గౌడ్, నర్సాపూర్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు అజ్మత్, దాడిగా నరేష్, అశోక్, మల్లేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు రాజీవ్ గాంధీ: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్
Published On: May 21, 2025 12:33 pm
