భారత్ లో సాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ: నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి/పటాన్ చెరు, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశానికి సాంకేతికతను తీసుకుని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ ను నిలిపింది రాజీవ్‌ గాంధీనేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని చిట్కుల్ లో ని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిన ఘనత మహనీయుడు రాజీవ్ గాంధీ సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment