సౌత్ ఇండియా సబ్ జూనియర్ అండ్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించిన యుగేందర్ ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సత్కరించారు.
బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో ఫతేనగర్ కు చెందిన యుగేందర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుగేందర్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
యుగేందర్ జిహెచ్ఎంసి భగత్ సింగ్ నగర్ జిమ్ లో శిక్షణ పొంది ఈ విజయం సాధించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇటీవలి కాలంలో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన యువత క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పథకాలు సాధించడం గర్వకారణమని ఆయన తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, కోచ్ ఆనంద్ రాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

