ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుంది: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్ కార్డులో పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, సంగారెడ్డి శాసన సభ్యుడు చింత ప్రభాకర్, నారాయణఖేడ్ శాసన సభ్యుడు సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేదలకు రుణ సహాయం బి సి, ఎస్ సి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ అందించడం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 39,000 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక కుటుంబానికి నూతన రేషన్ కార్డు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో వైద్య సేవల మెరుగు కోసం సంగారెడ్డిలో వైద్య కళాశాల స్థాపన 500 పడకల కొత్త ఆసుపత్రి శంకుస్థాపన వంటి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. పేదలకు ఇందిరమ్మ గృహ కేటాయింపులు కూడా త్వరలో వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో 213 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. సంగారెడ్డి మండలానికి సంబంధించి 15మంది లబ్ధిదారులకు, సదాశివపేట మండలానికి 75 మంది లబ్ధిదారులకు కొండాపూర్ 17 మంది లబ్ధిదారులకు, కంది మండలానికి సంబంధించి ఆరుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. షాదీ ముబారక్ పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 123 మంది లబ్ధిదారులకు రూ.1 కోటి 23లక్షల14వేల 277రూపాయలు చెక్కులను లబ్బిదారులకు మంత్రి అందజేశారు. సంగారెడ్డి మండలంలో 46 మంది లబ్ధిదారులకు, సదాశివపేట మండలంలో 64 మంది లబ్ధిదారులకు కొండాపూర్ లో 9 మందికి కంది మండలంలో నలుగురికి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

*సంగారెడ్డి నియోజకవర్గంలో 6000 మందికి నూతన రేషన్ కార్డులు:*

*జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య*

జిల్లాలో రేషన్ కార్డుల కోసం 68 వేల దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చినట్లు వీటిలో 39 వేల మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 6000 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. రేషన్ కార్డులో పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. అర్హులు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే ఆన్లైన్ లో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. జూన్ నెలలో మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యంను ఒకేసారి పంపిణీ చేసినట్లు ఈ నెల నుండి నూతన రేషన్ కార్డులకు, పాత రేషన్ కార్డులలో జత చేయబడిన వ్యక్తులకు సంబంధించి బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు జిల్లాలో నూతన రేషన్ కార్డులు 38526 మంజూరు కాగా పాత రేషన్ కార్డులలో 68883 మంది లబ్ధిదారులు అదనంగా చేర్చినట్లు కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి 8735.964 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా 4 లక్షల 10 వేల652 రేషన్ కార్డులకు పంపిణీ చేసేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 160 సంఘాలకు మెప్మా (మెప్మా) ద్వారా మొత్తం రూ.25,21,97,000/- నిధులు పంపిణీ చేయబడినట్లు, ఈ నిధులు మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి, స్వయం ఉపాధి కార్యక్రమాల అభివృద్ధికి ఉపయోగ పడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment