కామారెడ్డి పట్టణ సబ్ఇన్స్పెక్టర్గా సుదీర్ఘకాలం సేవలందించిన ఎం. శ్రీరామ్ పదవీ విరమణ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సేవలను అధికారులు కొనియాడారు.
పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (ఏఎస్పీ) చైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, శ్రీరామ్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, శ్రీరామ్ తన సేవా కాలమంతా నిబద్ధతతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన కృషి ఆదర్శనీయమని ప్రశంసించారు.
పట్టణ సీఐ నరహరి కూడా శ్రీరామ్ సహచరులతో సమన్వయం సాధిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పదవీ విరమణ అనంతరం కూడా ప్రజాసేవలో కొనసాగుతానని శ్రీరామ్ తెలిపారు. తనకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


