Kamareddy/Madnur (ప్రశ్న ఆయుధం) జూలై 03
కామారెడ్డి జిల్లాలో సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయడంతో పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టు విస్తరణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆయన కీలక సూచనలు చేశారు.
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీలను వేగవంతం చేయడంతో పాటు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టు విస్తరణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రెండు వేర్వేరు సమీక్షా సమావేశాల్లో ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ముందుగా సీఎంఆర్ డెలివరీలపై నిర్వహించిన సమీక్షలో రబీ 2024–25, ఖరీఫ్ 2025–26, రబీ 2025–26 సీజన్లకు సంబంధించి 3,48,991 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ డెలివరీలు పెండింగ్లో ఉండటంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. జూలై నెలలో కనీసం 20 రైల్వే రేకుల ద్వారా బియ్యం తరలింపు జరిగేలా ఎఫ్సీఐ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అడ్లూర్ ఎల్లారెడ్డి ఐజీ-2, ఉప్పల్వాయి గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్కు సంబంధించిన స్థలాలను వెంటనే విడుదల చేయాలని, అన్లోడింగ్ పనులకు తగిన సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. నాణ్యత పరిశీలనలో అన్ని కేంద్రాల్లో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. రోజుకు 50 సీఎంఆర్ లాట్ల డెలివరీ లక్ష్యాన్ని సాధించేందుకు కామారెడ్డి డివిజన్లో అదనంగా నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లను నియమించాలని సూచించారు. రైస్ మిల్లర్లు సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు సహకరించాలని కోరారు.
అనంతరం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టు అమలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్ (ఎంఎన్జీఎల్)కు అన్ని శాఖలు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.
పైప్లైన్ పనులకు అవసరమైన అన్ని అనుమతులను 24 గంటల్లోపు జారీ చేయాలని, రోడ్లు, భూగర్భ యుటిలిటీలకు సంబంధించిన డిజిటలైజ్డ్ మ్యాపులను అందుబాటులో ఉంచాలని సూచించారు. తవ్వకాలు చేపట్టే ముందు 'కాల్ బిఫోర్ యూ డిగ్ (CBUD)' యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తూ, ప్రాజెక్టు పురోగతిని నిరంతరం పర్యవేక్షించి ప్రతి నెల నివేదిక సమర్పించాలని సూచించారు.












