సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాకు చెందిన అబ్దుర్ రెహమాన్, అలియా ఫాతిమా, అబ్దుల్ నజీర్ ఈ నెల 6,7వ తేదీన భూపాలపల్లి లో జరిగిన 9వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్టిక్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్-2024 రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తన ఛాంబర్ లో అభినందిస్తూ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో స్విమ్మింగ్ పూల్ లో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని, విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ జిల్లాకు చెందిన అబ్దుర్ రెహమాన్, ఆలియా ఫాతిమా జాతీయ స్థాయిలో ఎంపికైనందుకు టీఎన్జీవోస్ పక్షాన కృతజ్ఞతలు తెలుస్తున్నానని, రానున్న రోజుల్లో విద్యార్థులు మరిన్ని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. విజయవాడలో జరిగే జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు వారికి కావాల్సిన ఆర్థిక తోడ్పాటు అందిస్తానని ఆయన తెలియజేశారు. పీడీ స్విమ్మింగ్ కోచ్ శేషు కుమార్ సిమ్మర్స్ ను ప్రతిభావంతులుగా రాణించడానికి చేస్తున్న కృషికి జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ ఓ కసిమ్ బేగ్, ఎస్ జీఎఫ్ జిల్లా సెక్రెటరీ అమూల్య, టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, వెంకటరెడ్డి, పీడీ షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Published On: December 17, 2024 6:30 pm
