తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోందని ఈ సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాగా, ఈ తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో రాష్ట్రంలోని ప్రతీ ఉద్యోగి పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తూ నేడు సర్క్యులర్ జారీ చేసింది. ఈనెల 25 వ తేదీ వరకు జరిగే విజన్-2047 సర్వేలో అందరు ఉద్యోగులు పాల్గొనడంతో పాటు ఈ సర్వే లింక్ ను, క్యూ క్యు ఆర్ కోడ్ ను తమ తమ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఆ సర్క్యులర్ లో ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment