Headlines (Telugu)
-
విద్యార్థులకు కానుకగా కాస్మోటిక్ చార్జీల పెంపు
-
సీఎం రేవంత్ రెడ్డికి అధ్యాపక బృందం కృతజ్ఞతలు
-
గొప్ప ఉత్సవంగా కేక్ కట్ చేసిన కోత్లాపూర్ గురుకుల పాఠశాల
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మండలం కొత్త్లాపూర్ గ్రామంలో గల శ్రీ మహాత్మా జ్యోతి బాయ్ పూలే బీసి రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ బాల బాలికల గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు దీపావళి కానుకగా తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రతి నెల అందజేసే కాస్మోటిక్ చార్జీలను 40 శాతానికి పెంచినందుకు కోత్లాపూర్ విలేజ్ గురుకుల పాఠశాలలో కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్ధుల పక్షాన అధ్యాపక బృందం హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె. స్రవంతి, వైస్ ప్రిన్సిపాల్ జి. మహేశ్వరి, అధ్యాపక బృందం అన్నపూర్ణ, హిమబిందు, అపర్ణ, మునియమ్మ మునీశ్వరి, స్వరూప, స్వప్న, అంబిక, బాల బాలికలు పాల్గొన్నారు.