పచ్చటి గ్రామాలను మున్సిపాలీటీలుగా మార్చే నిర్ణయం పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి: నవ భారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): పచ్చటి గ్రామాలను మున్సిపాలీటీలుగా మార్చే నిర్ణయం పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నవ భారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం సరికాదని, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే బావుండేదని మెట్టు శ్రీధర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామాలల్లో చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, గ్రామ పంచాయతీ హోదాను కోల్పోతే గ్రామీణ ఉపాధి హామీ పథకాలు వర్తించవని, గ్రామ కంఠం భూములలో ఇంటి నిర్మాణం చేపట్టాలన్న, వ్యవసాయ రుణాల విషయంలో వెసులుబాట్లు కోల్పోయే ప్రమాదం ఉందనిఅన్నారు. కాబట్టి ప్రజల అభిప్రాయలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగాలని మెట్టు శ్రీధర్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment