ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం జిల్లాలోని ఎంఈఓలు, కస్తూరిబా పాఠశాలల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ బడిబాట కార్యక్రమం, మన ఊరు మనబడి, పాఠశాల విద్య పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో పట్టణాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు వార్షిక విద్యా క్యాలెండర్‌ను పూర్తిగా అమలు చేయాలి. తనిఖీలకు వెళ్ళినప్పుడు సమస్యలను విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఎన్ఈవోలు కృషి చేయాలన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో చదువు కొనడం ఆపివేసే బాలికలను ఆయా మండలాలలోనూ కస్తూరిబా పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందున క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన బాధ్యత మండల విద్యాధికారులది అన్నారు. ఎంఈఓ లో ప్రతిరోజు కనీసం రెండు పాఠశాలల ను తనిఖీ చేయాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల హాజరు శాతం ఉపాధ్యాయుల బోధన కు విద్యార్థులు ఈ విధంగా సన్నద్ధమవుతున్నారు తదితర విషయాలను గమనించి ప్రతిరోజు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో ఎంఈఓ లు పాఠశాలల తనిఖీ వివరాలు నమోదు చేయాలన్నారు. పాఠశాలల్లో వంట పాత్రలు కొనుగోలు కోసం వచ్చిన నిధులతో నూతన పాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నచోట వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మన ఊరు -మన బడిలో పెండింగ్లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో అసంపూర్తిగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని సూచించారు. పదవ తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 3429 మంది విద్యార్థులు వివిధ కళాశాలలో చేరినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యావ్యవస్థ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోవిందరావు, టీజీ ఈడబ్ల్యుఐడీసీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment