సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల సహకారంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్, ఆధునికీకరించిన తరగతి గదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ… బడి బయట పిల్లలు అందరిని ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని విద్యాధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులు సామాజిక ప్రయోజనాల కోసం వినియోగించడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పారిశ్రామిక వేత్తలు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భముగా వాటర్ ఎయిర్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్, తవక్కం అనే స్వచ్ఛంద సంస్థలు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైనట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వెల్లడించారు. వారి కృషి హర్షనీయమని ఆమె పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపడతాయని అన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫారమ్స్, డిజిటల్ విద్యాబోధన, పాఠశాలకు కావలసిన వసతుల గురించి విద్యార్థులతో  మాట్లాడి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శంకర్, తహసీల్దార్, వాటర్ ఎయిర్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్, తవక్కం సంస్థల ప్రతినిధులు కృష్ణకుమార్, సురేష్, దినేష్ బాబు, కె.దుర్గా ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment