స్వాముల మహారాజ్ ఎన్నిక
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 10
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ లంబడి హక్కుల పోరాట సమితి తీజ్ కమిటీ వద్ద సమావేశం ఏర్పాటు చేసి స్వాముల మహారాజ్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సమావేశంలో హథీరాం బావాజీ, మహా సంగ్ శివరాం మహా రాజ్ సమక్షంలో లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించారు. కామారెడ్డి జిల్లా హాథీరాం మహాసంఘ జిల్లా అధ్యక్షులుగా రాంజీ మహారాజ్, కార్యదర్శిగా రాజు మహారాజ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షులు గణేష్ నాయక్, బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శీను నాయక్,
తీజ్ కమిటీ అధ్యక్షులు లింగం నాయక్, కామారెడ్డి జిల్లా శాఖ సేవ్య మారాజ్, రాజు మహారాజ్, నిజాంబాద్ జిల్లా శాఖ నారాయణ మహారాజ్, చరణ్ మహారాజ్, చందర్ మహారాజ్, మురళీ మహారాజ్, శ్రవణ్ నాయక్, రూప్ సింగ్ నాయక్, పుల్ చంద్, విజయ్ లు పూజారి మాహా రాజ్ లకు సన్మానించారు,