సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, బోధన్ ఆసుపత్రులలో మౌలిక వసతులు మెరుగు కోసం నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించేందుకు అవసరమైన అధునాతన సౌకర్యాలను కల్పించడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలో వైద్య కళాశాల పర్యవేక్షణ కమిటీలను నియమించింది. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల పర్యవేక్షణ కమిటీ లో డ్రగ్ కంట్రోల్ అడ్మిన్ డీజీ అండ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ షా నవాజ్ ఖాసిం, డైరెక్టర్ జనరల్ డిసిఏ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య, డిఎంఈ నుండి విమల థామస్, అసిస్టెంట్ డీఎంఈ డాక్టర్ వాణి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.సుధా మాధురి, సభ్యులుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల పర్యవేక్షణ కమిటీ (ఎంసీఎంసీ) సభ్యులు బుధవారం సంగారెడ్డి మెడికల్ కళాశాలను, బోధన ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వార్డులను బ్లడ్ బ్యాంకును, ఐసీయును విద్యార్థుల తరగతి గదులను, ల్యాబ్ లను, హాస్టల్ గదులను పరిశీలించారు. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ నిబంధనల మేరకు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఇంకా కావలసిన సౌకర్యాలకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు అవసరమైన అధునాతన సౌకర్యాల కల్పన కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరిండెంట్లను ఈ సందర్భంగా ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను వెంటనే నిర్మాణం పూర్తయ్యేలా చేసి వినియోగంలోకి తేవాలని అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు, విద్యార్థులకు రవాణా కోసం బస్సుల ఏర్పాటు, ఆసుపత్రిలో మెడికల్ కళాశాలలో భద్రత చర్యలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అనిల్ కుమార్, ఆర్అండ్ బి డిఈ రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి మెడికల్ కళాశాలను సందర్శించిన వైద్య కళాశాల పర్యవేక్షణ కమిటీ
Published On: June 25, 2025 8:06 pm
