సంగారెడ్డి, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ళ సంగమేశ్వర్, ఆత్మ కమిటీ చైర్మన్ నాలచేరు కచూర్ రావులను నాయకులు సన్మానించారు. బుధవారం వట్ పల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ళ సంగమేశ్వర్, ఆత్మ కమిటీ చైర్మన్ నాలచేరు కచూర్ రావులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వినయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ జోషి, మాజీ ఎంపీపీ పత్రి విఠల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణగౌడ్, శివచరణ్, పరమేష్, ప్రశాంత్ పాటిల్, ప్రవీణ్ గౌడ్, దిగంబర్, శ్రీకాంత్, కళ్యాణ్, హర్షవర్ధన్ రెడ్డి, సంతోష్, అరవింద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ రావు, ఎన్ఎస్ యూఐ ఆందోల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజా తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ళ సంగమేశ్వర్ సన్మానించిన నాయకులు
Published On: June 18, 2025 6:55 pm
