లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ను సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి ch,వరప్రసాద్ 

లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ ను సందర్శించిన ప్రధాన న్యాయమూర్తి ch,వరప్రసాద్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 21

శనివారం రోజున జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా చైర్మన్‌ మరియు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ప్రధాన న్యాయమూర్తి Ch. V.R.R. వరప్రసాద్ లిటిల్ స్కాలర్స్ హై స్కూల్, కామారెడ్డిని సందర్శించారు. తెలంగాణలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ భారతదేశంలోనే మొట్టమొదటి స్కూల్ ఆధారిత రేడియో స్టేషన్ అయిన “లిటిల్ స్కాలర్స్ రేడియో” ను ప్రారంబిచింధి. అని తెలిసి పాఠశాల యాజమాన్యాన్ని అభినందిచారు. ఈ వినూత్న ఆలోచన ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసం, సమాచార నైపుణ్యాలు మరియు సృజనాత్మకత అభివృద్ధి చెందనున్నది.

విద్యార్థుల్లో న్యాయపరమైన అవగాహన పెంపొందించడానికి, సమాజానికి ఉపయోగపడే చట్టాలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్బంగా,న్యాయమూర్తి స్కూల్ లో నిర్వహించిన ప్రత్యేక రేడియో పోడ్కాస్ట్ (PODCAST) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోడ్కాస్ట్ ద్వారా “డ్రగ్ దుర్వినియోగం – దాని దుష్పరిణామాలు” మరియు NALSA DAWN Scheme 2025 పై వివరాలు అందించారు. DAWN అంటే “Drugs Awareness and Wellness Navigation” అని, ఈ కార్యక్రమం ద్వారా యువతలో మత్తు పదార్థాల వాడకంపై చట్టపరమైన అవగాహన పెంపొందించడం, వారిలో బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని నెలకొల్పడం ముఖ్యలక్ష్యంగా ఉంచినట్టు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమం పాఠశాల పిల్లలకు చేరడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా వినిపించేందుకు మంచి వేదికగా నిలుస్తోంది అని తేలిపారు. తరువాత, 10వ తరగతి విద్యార్థులకు ఉద్దేశించి POCSO చట్టం (Protection of Children from Sexual Offences Act) మరియు ఇతర చట్టాల పై న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఇందులో బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ కోసం చట్టం అందించే అవకాశాలు, విద్యార్థుల హక్కులు, మొదలైన అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. విద్యార్థులతో సూటిగా సంభాషిస్తూ, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమ అని చెప్పారు.ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, నాగరాణి స్కూల్ చైర్మన్, పున్న రాజేష్, ప్రిన్సిపాల్ స్వాతి ప్రియా, ఉపాధ్యాయులు ప్రత్యుష, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, సంస్థ సిబ్బంది ఖాన్ , సాయి ప్రణీత్ మరియు విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు.

ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్, హృదయపూర్వకంగా ప్రశంసించారు. మరియు పాఠశాల యాజమాన్యం మరియు టీమ్‌కు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment