సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 21
మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోళ్ల బీమా గౌడ్, అనారోగ్య పరిస్థితుల దృశ్య సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ మంత్రి షబ్బీర్ అలీ మంజూరు చేసినట్లు జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ తెలియజేశారు. షబ్బీర్ అలీ చేతుల మీదుగా ఆ చెక్కు అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరి గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం మధు తదితరులు ఉన్నారు.